Mohammed Siraj Emotional: మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ నోట్, ‘మిస్ యు పప్పా’ అంటూ భావోద్వేగం!
ప్రపంచ నంబర్ 1 వన్డే బౌలర్గా అవతరించి మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
- By Balu J Published Date - 11:35 AM, Thu - 21 September 23
బుధవారం వెల్లడించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఆసియా కప్ 2023 ఫైనల్లో సిరాజ్ అద్భుతమైన 6/21తో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 8వ టైటిల్ ను గెలుచుకుంది. ఆసియా కప్ 2023లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ ర్యాంకింగ్స్లో నమ్మశక్యంకాని స్థానానికి చేరుకున్నాడు. టీమ్ ఇండియా మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ 2023 ఆసియా కప్లో 6 మ్యాచ్ల్లో 10 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు.
సిరాజ్ మళ్లీ ప్రపంచ నంబర్ 1 వన్డే బౌలర్గా అవతరించిన రోజు, పేసర్ తన దివంగత తండ్రి కోసం ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ‘మిస్ యు పప్పా’ అనే సందేశంతో సిరాజ్ తన తండ్రి, తల్లి చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సిరాజ్ తన తండ్రి మహమ్మద్ గౌస్ను రెండేళ్ల క్రితం కోల్పోయాడు. గౌస్ వయస్సు 53. 2021లో ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా మరణించాడు. కానీ సిరాజ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు, ఎందుకంటే అతను ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత బౌలింగ్ కు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: MLC Kavitha: బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
Related News
T20 World Cup: టీమిండియాకు పట్టిన శని అంపైర్ మళ్లీ వచ్చేశాడు
అమెరికా, వెస్టిండీస్లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్కు 26 మంది మ్యాచ్ అధికారుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. 28 రోజులలో 9 వేర్వేరు ప్రదేశాల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి.