MI vs PBKS: ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర మ్యాచ్.. ముంబై జోరుకి పంజాబ్ బ్రేక్ వేస్తుందా..?
శనివారం (ఏప్రిల్ 22) ఐపీఎల్ (IPL 2023) రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
- By Gopichand Published Date - 01:32 PM, Sat - 22 April 23
శనివారం (ఏప్రిల్ 22) ఐపీఎల్ (IPL 2023) రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ సొంత మైదానం ‘వాంఖడే’లో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మైదానంలో ఛేజింగ్లో ఉన్న జట్టు విజయాల రేటు ఎక్కువగా ఉంటుంది.
ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య సమ పోటీ నెలకొంది. ఐపీఎల్లో ఈ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఇక్కడ ముంబై ఇండియన్స్ 15 మ్యాచ్లు గెలవగా, 14 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే.. పంజాబ్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. అంటే అత్యధిక సార్లు IPL ఛాంపియన్గా (5) నిలిచిన ముంబై ఇండియన్స్కు పంజాబ్ ఆటగాళ్లు ఎప్పుడూ సమాన పోటీని ఇస్తూనే ఉన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్ల్లో పంజాబ్కు ఒక్క విజయం మాత్రమే దక్కింది. పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు, ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తమ రెండు ఓపెనింగ్ మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ జట్టు మూడు మ్యాచ్లను వరుసగా గెలిచి గొప్ప పునరాగమనం చేసింది. ప్రస్తుతం ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: MS Dhoni: ఇదే నా చివరి ఐపీఎల్: ధోని సంచలన వ్యాఖ్యలు!
IPL 2021 నుండి ఇప్పటి వరక, వాంఖడే వేదికగా రాత్రి సమయంలో మొత్తం 32 T20 మ్యాచ్లు జరిగాయి. అయితే 22 మ్యాచ్ల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక్కడ రాత్రి సమయంలో రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు ఇబ్బందులు కలిగించే పెద్ద అంశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు ఇక్కడ ఛేజింగ్కే మొగ్గుచూపుతుంది.
IPL 2023లో ఇక్కడ జరిగిన మ్యాచ్లను విశ్లేషిస్తే.. నేటి మ్యాచ్లో స్పిన్ బౌలర్లు ఈ మైదానంలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. నిజానికి ఈ సీజన్ లో ఇక్కడ జరిగిన మ్యాచ్ ల్లో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు మెరుగ్గా రాణించారు. స్పిన్నర్లు 7.64 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేసి 13 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లు 10.17 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ 9 వికెట్లు మాత్రమే తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. కానీ ముంబైకి సొంత మైదానం అనుకూలించడంతోపాటు విజయం సాధించిన జోరు వారికి అదనపు సహాయాన్ని అందిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ముంబై జట్టు నేటి మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.
Related News
SRH vs PBKS: ఐపీఎల్ చరిత్రలో జితేష్ శర్మ సంచలన నిర్ణయం
ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తన ప్లేయింగ్ 11లో ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని చేర్చుకోవడం ఇదే తొలిసారి. సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ 11వ ర్యాంక్లో ఏకైక విదేశీ ఆటగాడు రిలే రూసోకు అవకాశం లభించింది. ఇంతకుముందు ఐపీఎల్లో ఏ జట్టు కూడా ఒకే ఒక్క విదేశీ ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చలేదు.