MI vs CSK: ముంబైతో మ్యాచ్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. ఇది ఊహించలేదు..!
ఐపీఎల్లో 2024లో 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు సీఎస్కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
- By Praveen Aluthuru Published Date - 06:12 PM, Sun - 14 April 24
![MI vs CSK: ముంబైతో మ్యాచ్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. ఇది ఊహించలేదు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/AI_8634-1.jpg)
MI vs CSK: ఐపీఎల్లో 2024లో 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు సీఎస్కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్కు ఆ జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరనా దూరం కావచ్చు. నివేదికల ప్రకారం.. జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని సూచించాడు.
మతిషా పతిరానా గాయం మనం అనుకున్నంత తీవ్రంగా లేదు. కాబట్టి అతను నేటి మ్యాచ్ (ముంబై వర్సెస్ చెన్నై) ఆడలేకపోతే అతను తదుపరి మ్యాచ్లో ఆడగలడని మేము ఆశిస్తున్నాము. ఈ మ్యాచ్ ప్రాముఖ్యత మాకు తెలుసు. కానీ అతను పూర్తిగా ఫిట్గా ఉండాలని మేము కోరుకుంటున్నామని కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు.
మతిషా పతిరానా గురించి మాట్లాడితే.. గాయం కారణంగా అతను ఇప్పటికే రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అతను కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడలేదు. ప్రస్తుతం అతను పూర్తిగా ఫిట్గా ఉండేందుకు దగ్గరగా ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిపై ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని అంతర్గత వర్గాల సమాచారం.
ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో రెండు గెలిచిందని, 3 మ్యాచ్ల్లో ఓడిపోయిందని మనకు తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో మూడింటిలో విజయం సాధించగా, రెండు మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో విజయం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండింటికీ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తమ గెలుపు జోరును కొనసాగించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ జట్టు మొదటి కొన్ని మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈ ఇరుజట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.
We’re now on WhatsApp : Click to Join
ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే తొలిసారి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఆటగాళ్లగా తమ జట్లతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మ్యాచ్లో ఈ స్టార్ ప్లేయర్లు ఇద్దరు ఎలా రాణిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: World War 3 : వరల్డ్ వార్-3 తప్పదా..? నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Mumbai Indians: ఈసారి ఐపీఎల్లో రచ్చ రచ్చే.. ముంబైని వీడనున్న రోహిత్, సూర్యకుమార్..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-Screenshot-2024-07-24-112843_11zon.png)
Mumbai Indians: ఈసారి ఐపీఎల్లో రచ్చ రచ్చే.. ముంబైని వీడనున్న రోహిత్, సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.