HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Match Called Off Due To Rain India Win Series 2 0

India Win Series: మూడో టీ20 రద్దు.. కెప్టెన్‌గా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న బుమ్రా..!

భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ని 2-0 తేడాతో భారత జట్టు కైవసం (India Win Series) చేసుకుంది.

  • Author : Gopichand Date : 24-08-2023 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Win Series
Compressjpeg.online 1280x720 Image 11zon

India Win Series: భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ని 2-0 తేడాతో భారత జట్టు కైవసం (India Win Series) చేసుకుంది. భారత్-ఐర్లాండ్ మూడో టీ20 మ్యాచ్‌లో డబ్లిన్‌లో నిరంతరాయంగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ను బంతి వేయకుండానే రద్దు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇండియా- ఐర్లాండ్ మధ్య మూడవ T20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా రాత్రి 10.30 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ విధంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 ఫలితం లేకుండానే ముగిసింది.

Also Read: Jogging – Running : జాగింగ్, రన్నింగ్.. ఎలా చేయాలి?

సిరీస్‌ భారత్ కైవసం

ఆగస్టు 18న భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం ఆతిథ్య ఐర్లాండ్‌ను ఓడించింది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో ఆగస్టు 20న ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు 33 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తద్వారా 3 టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. కాగా మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దింతో 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India vs Ireland
  • india win series
  • ireland
  • Jasprit Bumrah

Related News

    Latest News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

    • టాయిలెట్ పేపర్‌ను వాడుతున్నారా? అయితే న‌ష్టాలివే!

    • భార‌త్‌లో ఒకే వేదిక‌పై క‌ల‌వ‌నున్న ఇరాన్, సౌదీ అరేబియా!

    • Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    Trending News

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd