PV Sindhu: స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ.. ఫైనల్కు చేరుకున్న పీవీ సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) శనివారం (ఏప్రిల్ 1) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్లో సింగపూర్కు చెందిన యో జియా మిన్ను ఆమె వరుస గేమ్లలో మట్టికరిపించింది.
- By Gopichand Published Date - 07:03 AM, Sun - 2 April 23
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) శనివారం (ఏప్రిల్ 1) మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నమెంట్లో ఫైనల్కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్లో సింగపూర్కు చెందిన యో జియా మిన్ను ఆమె వరుస గేమ్లలో మట్టికరిపించింది. సింధు ఈ ఏడాది తొలిసారిగా టోర్నీలో ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో రెండో సీడ్ సింధు 24-22, 22-20తో విజయం సాధించింది.
మిన్పై సింధుకు ఇది నాలుగో విజయం. తొలి గేమ్లో సింధు ఒక దశలో 15-20తో వెనుకంజలో ఉంది. తర్వాత సింధు తన ఆధిపత్యం చూపించింది. తొలి గేమ్ను 24-22తో సింధు గెలుచుకుంది. రెండో గేమ్లోనూ సింధు 1-4తో వెనుకంజలో ఉంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి 11-6తో ముందంజ వేసింది. ప్రపంచ 33వ ర్యాంకర్ సింధుకు గట్టిపోటీనిచ్చి మ్యాచ్ను చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగించింది. సింధు 22-20తో రెండో గేమ్ను కైవసం చేసుకుంది.
గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత సింధుకి ఇదే తొలి ఫైనల్. స్థానిక క్రీడాకారిణి, టాప్ సీడ్ కరోలినా మారిన్, ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా టున్జుంగ్ మధ్య జరిగే మరో సెమీ-ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆమె తలపడుతుంది. ఈ విజయంతో సింధులో మనోధైర్యం పెరుగుతుంది. గాయం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి సింధు తన మునపటి ఫామ్ కోసం కష్టపడుతోంది. నవంబర్ 2016 తర్వాత సింధు తొలిసారి టాప్ 10కి దూరంగా ఉంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్లో ఆమె తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అలాగే ఈ నెల ప్రారంభంలో స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టైటిల్ను కాపాడుకోవడంలో విఫలమైంది. జనవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్, మలేషియా ఓపెన్లలో ఆమె మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది.
Related News
PV Sindhu : ఆసియా బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పసిడి దిశగా సింధు
ఆసియా బ్యాడ్మింటన్ (Asia Batminton) ఛాంపియన్షిప్లో పసిడి దిశగా భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. థాయ్లాండ్ ప్లేయర్ కతేథాంగ్తో జరిగిన మ్యాచులో 21-12, 21-12 తేడాతో పీవీ సింధు (PV Sindhu) విజయం సాధించారు. దీంతో టీమ్ మ్యాచులో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మలేషియాలోని షా ఆలమ్లో శనివారం జరిగిన సెమీస్లో భారత మహిళల జట్టు 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్లో 3-2తో జపాన్ను ఓడించి ఫైనల్�