IPL2022: కోల్ కత్తాతో పోరు…ముంబై బోణీ కొట్టేనా ?
- By Naresh Kumar Published Date - 10:05 AM, Wed - 6 April 22
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ జట్టు మూడో మ్యాచు లో ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి ఒకదాంట్లో ఓటమిచవిచూసిన కేకేఆర్ జట్టు కూడా మ్యాచ్ లో విజయం సాధించాలని యోచిస్తోంది. ఇక ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు మొత్తం 29 మ్యాచ్ల్లో తలపడగా ముంబై 22 మ్యాచుల్లో, కేకేఆర్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించాయి.
ఇక ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా నైట్రైడర్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో సామ్ బిల్లింగ్స్ , నితీష్ రాణా లోయర్ ఆర్డర్ లో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..
అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లోని ముంబై ఇండియన్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ , ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో అన్మోల్ప్రీత్ సింగ్,, మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, లోయర్ ఆర్డర్ లో టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. ఎం అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
అలాగే ఈ మ్యాచ్ జరగనున్న ఎంసీఏ పిచ్ మొదట బ్యాటింగ్ కు ఆట సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు సహకరిస్తుంది. మంచు కారణముగా , టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్నికొస్తే.. కోల్కతా నైట్రైడర్స్, కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ముంబై ఇండియన్స్ విజయం సాధించే అవకాశం ఉంది.
Related News
IPL 2024 Final: ఈ తప్పిదాలే సన్ రైజర్స్ కు శాపంగా మారాయి
పదేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాతా గౌతమ్ గంభీర్ హయాంలో కేకేఆర్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ లో కేకేఆర్కి ఇది మూడో టైటిల్ కాగా హైదరాబాద్ రెండో టైటిల్ను చేజార్చుకుంది. అయితే ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లను ధాటిగా ఎదుర్కున్న సన్ రైజర్స్ ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఫైనల్లో దారుణంగా ఓటమి పాలయింది. కాగా ఈ పరాజయానికి చాల