Kohli Gifts Babar Azam: బాబర్ ఆజంకు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..!
2023 వన్డే ప్రపంచకప్లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు కింగ్ కోహ్లీ ఓ గిఫ్ట్ (Kohli Gifts Babar Azam) ఇస్తూ కనిపించాడు.
- By Gopichand Published Date - 06:42 AM, Sun - 15 October 23
Kohli Gifts Babar Azam: 2023 వన్డే ప్రపంచకప్లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేసి 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు కింగ్ కోహ్లీ ఓ గిఫ్ట్ (Kohli Gifts Babar Azam) ఇస్తూ కనిపించాడు. విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు బహుమతిని అందివ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
FANBOY MOMENT FOR BABAR AZAM….!!
Babar asks for a signed from Virat Kohli and Virat gives it.pic.twitter.com/Caq3GoQoaV
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
భారత్ – పాక్ మ్యాచ్ పూర్తైన తర్వాత బాబర్ ఆజంకు తన జెర్సీని గిఫ్టుగా ఇచ్చాడు కోహ్లీ. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ వద్దకు వచ్చిన బాబర్ సంతకం చేసిన జెర్సీని ఇవ్వాల్సిందిగా కాంగ్ కోహ్లీని కోరాడు. దీంతో కోహ్లీ సంతకం చేసిన చేసిన జెర్సీని పాకిస్థాన్ కెప్టెన్కు అందివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్
మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ను భారత్ ఘోరంగా ఓడించింది. ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్కు ఇది వరుసగా ఎనిమిదో విజయం. తొలుత పాక్ జట్టు 191 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 30.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 117 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.
We’re now on WhatsApp. Click to Join.
భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో 86 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో హిట్మ్యాన్ 6 ఫోర్లు, 6 సిక్స్లు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 53 పరుగులతో నాటౌట్గా వెనుదిరిగాడు. అంతకుముందు బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
Related News
RCB vs GT: ఐపీఎల్లో నేడు మరో ఉత్కంఠ పోరు.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు..!
ఐపీఎల్లో శనివారం (మే 4) ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో వారి స్వదేశంలో తలపడుతుంది.