Ram Mandir in Ayodhya: విదేశాల్లో కూడా శ్రీరాముని భక్తులు.. త్వరలోనే అయోధ్య రానున్న విదేశీ స్టార్ క్రికెటర్..!
22 జనవరి 2024న అయోధ్యలో జరిగిన రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠ (Ram Mandir in Ayodhya)లో చాలా మంది భారతీయ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే భారత క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా రాముడిపై భక్తి ఉంది.
- By Gopichand Published Date - 01:15 PM, Sun - 11 February 24
Ram Mandir in Ayodhya: రాముని అభిమానులు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. చాలా మంది క్రికెటర్లు కూడా రాముడికి గొప్ప భక్తులు. 22 జనవరి 2024న అయోధ్యలో జరిగిన రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠ (Ram Mandir in Ayodhya)లో చాలా మంది భారతీయ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే భారత క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా రాముడిపై భక్తి ఉంది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ కూడా తాను రాముడి భక్తుడిని అని చెప్పుకున్నాడు. అయోధ్యకు వెళ్లాలని తన కోరికను వ్యక్తం చేశాడు. ఆ క్రికెట్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్కు ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తనను తాను రాముడి పెద్ద భక్తుడిగా అభివర్ణించుకున్నాడు. ఆయన కుడిచేతిపై ‘ఓం నమఃశివాయ్’ అని కూడా ఉంది. ఇది కాకుండా అతని బ్యాట్పై ‘ఓం’ స్టిక్కర్ కూడా కనిపించింది. కేశవ్ తన విశ్వాసంతో ఏ విషయంలోనూ రాజీపడడు. తాను ఎప్పుడు భారత్కు వెళ్లినా అయోధ్యను తప్పకుండా సందర్శిస్తానని కేశవ్ చెప్పారు.
Also Read: Ayodhya : అయోధ్య లో రెచ్చిపోతున్న దొంగలు..
నా విశ్వాసంతో నాకు చాలా అనుబంధం ఉంది – కేశవ్
దక్షిణాఫ్రికా T20 లీగ్ 2024 ఫైనల్కు ముందు కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. నేను చాలా మతపరమైన కుటుంబం నుండి వచ్చాను. మతం, ఆధ్యాత్మికత నాపై విధించబడలేదు. వారు నాకు క్లిష్ట సమయాలు, పరిస్థితులలో మార్గదర్శకత్వం, దృక్పథాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చాడు. SA20 2024లో కేశవ్ డర్బన్ సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా ఉన్నాడు. అతను తన జట్టును కూడా ఫైనల్కు తీసుకెళ్లాడు. కానీ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 79 పరుగులతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
We’re now on WhatsApp : Click to Join
కేశవ్ మహారాజ్ ముత్తాత భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్ నివాసి అని, అతను 1874 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని డర్బన్కు పని కోసం వెళ్ళాడని సమాచారం. కేశవ్ ఇంకా మాట్లాడుతూ.. నేను భారతదేశానికి వచ్చినప్పుడు వీలు చూసుకుని ఖచ్చితంగా అయోధ్యకు వెళ్తాను. నాకు IPL ఆడిన అనుభవం లేదు. కానీ SA20 అనుభవం గొప్పది. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశం ఇస్తోంది. ప్రేక్షకులు అత్యుత్తమ క్రికెట్ను చూడగలుగుతున్నారని పేర్కొన్నాడు. కేశవ్ భారత సంతతికి చెందిన విదేశీ ఆటగాడు. అతనికి భారతదేశంతో మంచి సంబంధం ఉంది. విదేశాల్లో ఉంటూ కూడా కేశవ్ దేవుళ్లపై తన నమ్మకాన్ని వదులుకోలేదు.
Tags
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.