Sachin Tendulkar : బీసీసీఐలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సచిన్ ?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడా... అయితే ఈ సారి మైదానంలో కాదు అడ్మినిస్ట్రేషన్ లో లిటిల్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సచిన్ ను బీసీసీఐలోకి తీసుకువచ్చేందుకు ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రయత్నిస్తున్నారు.
- By Hashtag U Published Date - 12:55 PM, Wed - 12 January 22
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడా… అయితే ఈ సారి మైదానంలో కాదు అడ్మినిస్ట్రేషన్ లో లిటిల్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. సచిన్ ను బీసీసీఐలోకి తీసుకువచ్చేందుకు ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రయత్నిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ వచ్చిన తర్వాత.. భారత క్రికెట్ దిగ్గజాలు ఒక్కొక్కరు టీమిండియాకు సేవలు అందిస్తున్నారు.భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టగా.. ఇటీవలే వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్గా బాధ్యతలు అందుకున్నాడు. వీరిలానే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని కూడా బీసీసీఐలోకి తీసుకురావాలని గంగూలీ ప్రయత్నిస్తున్నాడు. దీని కోసం బీసీసీఐ సెక్రటరీ జై షా సచిన్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
వీరి చర్చలు ఫలిస్తే త్వరలోనే సచిన్ బీసీసీఐలో కీలక పదవి చేపట్టే అవకాశముంది. మొదట్లో ద్రావిడ్ ప్రధాన కోచ్ గా వచ్చేందుకు అంగీకరించలేదు. చివరికి గంగూలీ, జైషా ద్రావిడ్ ఒప్పించగలిగారు. అలాగే ఎన్ సిఎ అకాడమీ డైరెక్టర్ గా వివిఎస్ లక్ష్మణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టకేలను లక్ష్మణ్ ను కూడా ఒప్పంచి బాధ్యతలు చేపట్టడంలో గంగూలీ, జైషా విజయవంతమయ్యారు. ఇప్పుడు సచిన్ ను కూడా ఒప్పించే ప్రయత్నం సక్సెస్ అయితే భారత క్రికెట్ లో మళ్ళీ నలుగురు దిగ్గజాలను చూడొచ్చు. అయితే మాస్టర్ కు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై తెలియలేదు. రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఐపీఎల్ లో ముంబై జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు.
Tags
Related News
BCCI Secretary: జై షా.. బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడో తెలుసా..?
జై షా బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే జై షా జర్నీ గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.