World Cup: టీమిండియాదే వరల్డ్ కప్.. జోస్యం చెప్పిన భారత జట్టు మాజీ కెప్టెన్..!
- Author : Gopichand
Date : 17-11-2023 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
World Cup: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ (World Cup)ను గెలుస్తుందని జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీమిండియా జట్టు విజయానికి చేరువలో ఉందన్నారు.
భారత్ను అడ్డుకోవడం చాలా కష్టం
సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ అద్భుతంగా కనిపిస్తోంది. టోర్నీలో భారత్ చాలా బాగా ఆడింది. ప్రపంచ కప్ ట్రోఫీ, ఆస్ట్రేలియా మధ్య ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఉంది. టోర్నీలో భారత్ తన ప్రదర్శనను కొనసాగిస్తే వారిని అడ్డుకోవడం కష్టమే. ఆస్ట్రేలియాకు కూడా మంచి జట్టు ఉన్నందున ఇది మంచి మ్యాచ్ అవుతుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
టీమిండియా ఆ ఫీట్ను పునరావృతం చేయాలి
సెమీస్ మ్యాచ్ భారత్కు బాగా కలిసొచ్చింది. న్యూజిలాండ్పై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లి అద్భుత సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్, మహ్మద్ షమీ బౌలింగ్ తో టీమ్ ఇండియా విజయం సాధించింది. 7 వికెట్లు తీసి తన బౌలింగ్లో బ్రేక్ లేదని నిరూపించాడు షమీ. ఇప్పుడు అందరి చూపు నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది.
Also Read: Five Players: ఫైనల్ మ్యాచ్.. ఈ ఐదుగురు భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా కీలకం..!
ఎయిర్ షో ప్రదర్శన
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక ఎయిర్ షోను ఏర్పాటు చేశారు. సమాచారం ప్రకారం, భారత వైమానిక దళానికి చెందిన ‘సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్’ మ్యాచ్కు ముందు తన ఎయిర్ షోను ప్రదర్శించనుంది. ఈ సమాచారాన్ని గుజరాత్ రక్షణ శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంచుకున్నారు. ఈ బృందం సుమారు 10 నిమిషాల పాటు ఎయిర్ షో చేస్తుందని పేర్కొన్నారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీతో పాటు 2011 ప్రపంచకప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఫైనల్ మ్యాచ్ని వీక్షించేందుకు నరేంద్ర మోదీ స్టేడియానికి రానున్నారు. భారత ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు. ఈ మ్యాచ్ని వీక్షించేందుకు బీసీసీఐ, ఐసీసీ పెద్ద అధికారులు కూడా హాజరుకానున్నారు.