IPL 2024 Prize Money: ఐపీఎల్ ట్రోఫీ విజేత, రన్నరప్లకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
- By Gopichand Published Date - 01:30 PM, Sun - 26 May 24
IPL 2024 Prize Money: IPL 2024 ఫైనల్ మ్యాచ్ మే 26 ఆదివారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్- సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ జట్లలో ఒకటి నేడు ఛాంపియన్గా మారనుంది. కాగా నేడు కోల్కతా లేదా హైదరాబాద్ ట్రోఫీనే కాదు కోట్లాది రూపాయలను కూడా గెలుచుకోబోతున్నాయి. ఇది మాత్రమే కాదు మూడు, నాల్గవ స్థానాలు అంటే బెంగళూరు, రాజస్థాన్ జట్లపై కూడా డబ్బుల వర్షం కురవనుంది. IPL 2024లో ఛాంపియన్ టీమ్, రన్నరప్, థర్డ్.. ఫోర్త్ ప్లేస్ జట్లకు బీసీసీఐ ఎంత ప్రైజ్ మనీ (IPL 2024 Prize Money) ఇస్తుందో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఛాంపియన్ టీమ్కి ఎన్ని కోట్లు వస్తాయంటే..?
ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇది భారీ మొత్తం. రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. ఈ జట్లకు మాత్రమే కాదు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు కూడా భారీ మొత్తంలో డబ్బు పొందనున్నాయి. IPL 2024 ఫైనల్లో గెలిచిన జట్టు ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయలను ఇంటికి తీసుకువెళుతుంది. మరి కోల్కతా, హైదరాబాద్లలో ఏ జట్టు కోట్ల రూపాయలతో టోర్నీ ముగిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Also Read: IPL Betting : ఇవాళే ఐపీఎల్ ఫైనల్.. హైదరాబాద్ అడ్డాగా బెట్టింగ్స్ జోరు
రాజస్థాన్, బెంగళూరుకు ఎంత ప్రైజ్మనీ వస్తుందంటే..?
ఛాంపియన్, రన్నరప్ జట్లతో పాటు.. మూడు, నాల్గవ స్థానంలో ఉన్న జట్లకు కూడా బిసిసిఐ కోట్ల రూపాయలను ఇస్తుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది కాబట్టి ఆ జట్టుకు రూ.7 కోట్లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంలో ఉండగా ఆ జట్టుకు రూ.6.5 కోట్లు లభిస్తాయి.
We’re now on WhatsApp : Click to Join
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతకు కూడా భారీగా ప్రైజ్మనీ
ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో తన పేరును సంపాదించుకున్నాడు. ఎందుకంటే కోల్కతా, హైదరాబాద్లలో 700 కంటే ఎక్కువ పరుగులు చేయగల ఆటగాడు లేడు. ఈ స్థితిలో విరాట్ 741 పరుగులు చేశాడు. హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్ 567 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు హెడ్ 700 సంఖ్యను దాటడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఆరెంజ్ క్యాప్తో పాటు బీసీసీఐ అతనికి రూ.15 లక్షలు ఇవ్వనుంది. పర్పుల్ క్యాప్ గురించి మాట్లాడుకుంటే.. పర్పుల్ క్యాప్ విజేతకు రూ. 15 లక్షలు ఇవ్వనుంది.
Tags
Related News
Ambati Rayudu joker: అంబటి రాయుడిని వదిలేయండి ప్లీజ్.. పీటర్సన్ రిక్వెస్ట్
ఐపిఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ చిట్ చాట్ సందర్భంగా కెవిన్ పీటర్సన్ అంబటి రాయుడిని జోకర్ అని పిలిచాడు. తదనంతరం భారత అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాయుడిని టార్గెట్ చేస్తున్నారు.