Rohit Sharma: క్రికెట్ లో నాకు స్ఫూర్తి సచినే – రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టని సంగతి తెలిసిందే.
- By Naresh Kumar Published Date - 05:51 PM, Wed - 6 April 22
ఐపీఎల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టని సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తాము ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టుని టైటిల్ విన్నర్ గా నిలిపిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్ను మరోసారి టైటిల్ విన్నర్ గా నిలుపుతాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ లో నాకు ఎప్పటికీ సచిన్ టెండూల్కర్ నాకు స్ఫూర్తి. ఊహ తెలిసినప్పటినుంచి అతని ఆటను చూస్తు పెరిగాను. ఆయన క్రికెట్ లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. క్రికెట్ లో దాదాపు 25 ఏళ్లు సేవలందించాడు. ఎన్నో రికార్డులు సాధించినా.. ఆ గర్వం ఆయనలో ఎక్కడా కనిపించదు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ 15వ సీజన్ ముంబై లో జరుగుతుందండం వాళ్ళ తమకు పెద్దగా ఉపయోగమేమీ ఉండదని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో ఓటమిపాలైంది. అలాగే ఈ సీజన్ లో భాగంగా తమ తరువాతి మ్యాచ్ లో బుధవారం కోల్కతా నైట్రైడర్స్తో పోటీపడనుంది.
ఇదిలాఉంటే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముంగిట ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది వారిలో 17 మంది భారత్కు చెందినవారు ఉండగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అంతకుముందు రిటెన్షన్ ప్రక్రియలోభాగంగా రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, బుమ్రా, సూర్యకుమార్లను తమ వద్దే అట్టిపెట్టుకుంది. మిగతా 21 మంది ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది.
Related News
India Squad: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది.. ప్లేయర్స్ వీరే..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.