HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >India Women Outclass Sri Lanka To Take 2 0 Lead

Women Cricket: భారత మహిళలదే టీ ట్వంటీ సిరీస్‌

శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.

  • By Naresh Kumar Published Date - 08:30 PM, Sat - 25 June 22
  • daily-hunt
Indian Women Cricket
Indian Women Cricket

శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక మహిళల జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు రాణించినా.. మిగిలిన బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు.ఓపెనర్లు విష్మి 45, చమారి 43 పరుగులు చేయగా.. తొలి వికెట్‌కు 80 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. దీంతో లంక భారీస్కోరు చేసేలా కనిపించింది. అయితే లంక ఇన్నింగ్స్‌ సెకండాఫ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వెంటవెంటనే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. ఓపెనర్ల తర్వాత లంక జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకోగా.. రేణుకాసింగ్, పుజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 3.4 ఓవర్లలో 30 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 17, మేఘన 17 రన్స్‌కు ఔటైనా… కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, మంధాన కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ నిలకడగా ఆడడంతో భారత్ సునాయాసంగానే గెలిచింది. చివర్లో మరో మూడు వికెట్లు చేజారినా భారీ లక్ష్యం కాకపోవడంతో భారత్ మరో 5 బంతులు మిగిలుండగానే టార్గెట్ ఛేదించింది. మంధాన 34 బంతుల్లో 8 ఫోర్లతో 34 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ విజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.సిరీస్‌లో చివరి మ్యాచ్ సోమవారం జరగనుంది. తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లూ తలపడనున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india vs sri lanka
  • India women cricket team
  • T20
  • women cricket

Related News

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd