HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Zimbabwe Live Score 4th T20

IND vs ZIM: భారత్ లక్ష్యం 153 పరుగులు

భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 13-07-2024 - 6:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs ZIM
IND vs ZIM

IND vs ZIM: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 153 పరుగులు చేయాలి.

భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌లో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 152 స్కోరు సాధించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శన చేశాడు. సికందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండేకి బలి అయ్యాడు.ఇన్నింగ్స్ లో అతను 2 ఫోర్లు మరియు 3 సిక్సర్లు కొట్టాడు. తడివానాశే మారుమణి 32, వెస్లీ మాధవెరె 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.

భారత బౌలర్ల ఫర్వాలేదనిపించారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అరంగేట్రం ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తరఫున తుషార్ దేశ్‌పాండేకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ టూర్‌లో అరంగేట్రం చేసిన 5వ ఆటగాడిగా తుషార్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.

జింబాబ్వేజట్టు: వెస్లీ మాధేవేర్, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే (వికెట్), రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా.

భారత్ జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.

Also Read: Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 152
  • 4th T20
  • IND vs ZIM
  • india
  • Live Score
  • Zimbabwe

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd