IND vs SL 1st ODI: శ్రీలంకపై రోహిత్ ఎటాక్.. హాఫ్ సెంచరీ పూర్తి
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో లంక జట్టు సత్తా చూపి 230 పరుగులు చేసింది. శ్రీలంక యువ బ్యాట్స్ మెన్ దునిత్ వెలలాగే 67 పరుగులతో సత్తా చాటాడు. ఛేదనలో టీమిండియా అదే ఊపును కొనసాగించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.
- Author : Praveen Aluthuru
Date : 02-08-2024 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs SL 1st ODI: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. ఈ సమయంలో 20 ఏళ్ల శ్రీలంక ఆటగాడు దునిత్ వెలలాగే అద్భుతంగా బ్యాటింగ్ చేసి 67 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. డానిత్ కీలక ఇన్నింగ్స్ కారణంగానే శ్రీలంక జట్టు ఇంతటి గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది.
లంక జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పాతుమ్ నిస్సాంక 75 బంతుల్లో 56 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ 2-2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే 1-1 వికెట్లతో తమ ఖాతాలో వేసుకున్నారు.
231 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఊచకోత మొదలుపెట్టింది. ఓపెనర్లు గిల్, రోహిత్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ రోహిత్ శ్రీలంకపై హాఫ్ సెంచరీ పూర్తి చేయగా గిల్ 16 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. గిల్ నిష్క్రమించడంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కి వచ్చాడు. కాగా రోహిత్ తన ఫిఫ్టీ సమయానికి 7 ఫోర్లు, 3 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: Viraaji Review : ‘విరాజి’ మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ కొత్త సినిమా ఎలా ఉందంటే..