HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Thrash Zimbabwe To Play England In Semis

India Beat Zimbabwe: దర్జాగా సెమీస్‌కు… జింబాబ్వేను చిత్తు చేసిన భారత్‌

టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 స్టేజ్‌ను భారత్ టాప్ ప్లేస్‌తో ముగించింది.

  • Author : Naresh Kumar Date : 06-11-2022 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Schedule
Team India Schedule

టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 స్టేజ్‌ను భారత్ టాప్ ప్లేస్‌తో ముగించింది. గ్రూప్ 2 నుంచి చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా అగ్రస్థానంతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వే ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన వేళ 71 పరుగుల తేడాతో రోహిత్‌సేన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ రాహల్ , సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో భారీస్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలెట్‌గా చెప్పాలి. తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన వేళ స్కై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు భారత్ 150 స్కోర్ చేస్తుందనుకున్న దశలో సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఆరంభంలో రోహిత్ నిరాశ పరిచినా.. రాహుల్, కోహ్లీ కీలక పార్టనర్‌షిప్‌తో భారత్ కోలుకంది. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్‌తో అమాంతం స్కోర్ పెంచేశాడు. విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అప్పటి వరకూ సింగిల్స్ తీసిన సూర్య ఒక్కసారిగా సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య కుమార్ జోరుకు చివరి 5 ఓవర్లలో భారత్ 56 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ వచ్చాయి. మొత్తం మీద సూర్యకుమార్ మెరుపులు అభిమానులను అలరించాయి. స్కై కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

187 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి తొలి బంతి నుంచే తడబడింది. సికిందర్ రాజా, ర్యాన్ బుర్ల్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. రాదా 24 బంతుల్లో 34 , బుర్ల్‌ 22 బంతుల్లో 35 పరుగులు చేయడంతో జింబాబ్వే స్కోర్ 100 పరుగులు దాటగలిగింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. చివరికి ఆ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3 , పాండ్యా 2, షమీ 2 , అర్షదీప్‌, భువనేశ్వర్, అర్షదీప్‌సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ 2లో 8 పాయింట్లు సాధించిన భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బుధవారం తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india beat zimbabwe
  • India in semi finals
  • T20 world cup
  • World Cup 2022

Related News

T20 World Cup

వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక

  • Sports Events

    టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

Latest News

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

  • సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

  • సంస్థాగత వ్యవస్థలన్ని బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి – రాహుల్ కీలక వ్యాఖ్యలు

  • ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ నిర్మాణాలకు తక్కువ ధరకే సిమెంట్‌

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd