Ind Vs Aus: మళ్లీ తిప్పేసారు.. ఢిల్లీ టెస్టులో భారత్ టార్గెట్ 115
సొంత గడ్డపై భారత స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ కంటే మరింతగా బంతిని తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టీమిండియా మరో విజయంపై కన్నేసింది.
- By Gopichand Published Date - 11:31 AM, Sun - 19 February 23
సొంత గడ్డపై భారత స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ కంటే మరింతగా బంతిని తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టీమిండియా మరో విజయంపై కన్నేసింది. నిన్న చివరి సెషన్ లో దూకుడుగా ఆడిన ఆసీస్ కు మన స్పిన్నర్లు ఇవాళ కళ్లెం వేశారు. తొలి సెషన్ ఆరంభం నుంచే వారిని కంగారెత్తించారు.
జడేజా , అశ్విన్ చెరొక ఎండ్ నుంచీ చెలరేగిపోవడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ కోలుకోలేక పోయింది. ఫలితంగా కంగారూ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 113 రన్స్ కే కుప్పకూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
Also Read: Illegally Entered India: 16 మంది చొరబాటుదారులు అరెస్ట్.. 12 మంది విదేశీ పౌరులు
ఈ సీరీస్ లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 రన్స్ చేయగా…భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించింది. తాజాగా రెండో టెస్టులోనూ అదరగొట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు మరింత చేరువైంది.
Related News
Sri Lanka : భారత్కు వీసా ఫ్రీ ఎంట్రీని పునరుద్దరించిన శ్రీలంక
Sri Lanka: ద్వీప దేశం శ్రీలంక భారత్(India)లో పాటు మరికొన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ(Visa free entry)ని పునరుద్దరిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే భారత్ చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. We’re now on WhatsApp. Click to Join. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే […]