HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Can Play Three Fast Bowlers In Dharamshala Test Match

Dharamshala Test Match: నేటి నుంచి భార‌త్‌- ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య చివ‌రి టెస్టు.. ముగ్గురు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి..!

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.

  • Author : Gopichand Date : 07-03-2024 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Teamindia Tour Of England
Teamindia Tour Of England

Dharamshala Test Match: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టు మార్చి 3న ధర్మశాల చేరుకుంది. కాగా భారత జట్టు మార్చి 4 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించింది. ధర్మశాల టెస్టుకు ఒకరోజు ముందు ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. ఇంగ్లిష్ జట్టు ఆలీ రాబిన్‌సన్‌ను తొలగించి.. ధర్మశాల టెస్టు కోసం మార్క్ వుడ్‌ను జట్టులోకి తీసుకుంది.

ధర్మశాల టెస్టులో ఇంగ్లిష్ జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో వెళుతుంది, అయితే మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాన్ని మార్చుకుని ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో కాకుండా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లవచ్చని అంచనాలు ఉన్నాయి. ముగ్గురు బౌలర్లతో వెళ్లడానికి అతిపెద్ద కారణం ధర్మశాల పిచ్, అక్కడి వాతావరణం. ఈ పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు స్పిన్ కంటే ఎక్కువగా సహాయపడుతుంది.

ముగ్గురు బౌలర్లతో..?

ధర్మశాల రికార్డును పరిశీలిస్తే పిచ్‌పై స్పిన్ బౌలింగ్ ఫాస్ట్ బౌలర్లకు మరింత సహాయపడుతుంది. అయితే ధర్మశాలలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడింది. ఇందులో భారత జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ 2017లో ఆస్ట్రేలియాతో జరిగింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ రంగంలోకి దిగనుంది. అయితే ఇక్కడ స్పిన్ బౌలర్ల కంటే ఫాస్ట్ బౌలింగ్‌కే ఎక్కువ సహాయం అందుతుందని తెలుస్తోంది.

గణాంకాల గురించి చెప్పాలంటే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 20 మ్యాచ్‌లు ఆడబడ్డాయి. ఇందులో స్పిన్, ఫాస్ట్ బౌలర్లు కలిసి 248 వికెట్లు తీశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీటిలో 153 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే తీశారు. కాగా.. స్పిన్నర్లు 95 వికెట్లు తీశారు. ఈ గణాంకాలను చూసిన తర్వాత ధర్మశాల టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ త్రయంతో బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Also Read: Kangana Ranaut : స్టార్ హీరోల పెయిడ్ డ్యాన్సులు… కంగనా కామెంట్స్‌..!

జస్ప్రీత్ బుమ్రా తిరిగి జ‌ట్టులోకి

రాంచీ టెస్ట్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత భారత జట్టు యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ధర్మశాల టెస్టులో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. పనిభారం కారణంగా రాంచీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. బుమ్రా గైర్హాజరీలో అరంగేట్రం ఆటగాడు ఆకాశ్ దీప్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బ‌తీశాడు. అయితే బుమ్రా పునరాగమనం తర్వాత భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ధర్మశాల టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ధర్మశాల టెస్టుపై భారత్ దృష్టి

సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌కు పునరాగమనం చేసే అవకాశం ఇవ్వదని భావించారు. అయితే విశాఖపట్నం టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత రాజ్ కోట్ టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో ఇంగ్లండ్ వెన్ను విరిచి 434 పరుగులతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు.

రాజ్‌కోట్ తర్వాత రాంచీ టెస్టులో భారత యువ ఆటగాళ్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ధర్మశాల టెస్టులో భారత్ విజయానికి వీరుడు ఎవరనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ధర్మశాల టెస్టులో భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dharamshala
  • Dharamshala Test Match
  • IND vs ENG
  • indian cricket team
  • test series

Related News

IND vs SA

IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భార‌త్ ఘ‌న‌విజ‌యం!

118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు.

  • ODI Cricket

    ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

  • IND vs SA

    IND vs SA: తిల‌క్ ఒంట‌రి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!

Latest News

  • ‎బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!

  • ‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd