Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ రియల్ స్టోరీ ఇదే.. స్కూల్ ఫీజు కోసం పని..!
హరీస్ రౌఫ్ (Haris Rauf) ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కానీ ఒకప్పుడు టేప్ బాల్ క్రికెట్ ఆడుతూ, సెలవు రోజుల్లో చిరుతిళ్లు అమ్మి ఫీజు కట్టేవాడు.
- By Gopichand Published Date - 09:37 PM, Fri - 13 October 23
Haris Rauf: హరీస్ రౌఫ్ (Haris Rauf) ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. కానీ ఒకప్పుడు టేప్ బాల్ క్రికెట్ ఆడుతూ, సెలవు రోజుల్లో చిరుతిళ్లు అమ్మి ఫీజు కట్టేవాడు. తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హరీస్ రౌఫ్, తన స్కూల్ ఫీజు చెల్లించడానికి తన తండ్రికి తగినంత ఆదాయం లేదని చెప్పాడు.
తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి హరీస్ టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడు. దాని ద్వారా అతను తన ఫీజులను చెల్లించేవాడు. తన తల్లికి సొంత ఇల్లు ఉండాలని కల ఉందని పాక్ బౌలర్ చెప్పాడు. ప్రస్తుతం హరీస్ ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నాడు. గంటకు 150 కి.మీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే అతికొద్ది మంది బౌలర్లలో అతను ఒకడు.
వన్డే వరల్డ్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీస్ ఈ విషయాలన్నీ వెల్లడించాడు. మాట్లాడుతున్నప్పుడు.. “నేను చదువుకు డబ్బు సంపాదించడానికి టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడిని, మా నాన్నగారి సంపాదన స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోదు, డబ్బు సంపాదించడానికి నేను ఆదివారం చిరుతిళ్లు అమ్మేవాడిని. మాకు ఒక సొంత ఇల్లు ఉండాలని మా అమ్మ కలలు కన్నారు.” అని చెప్పాడు.
Also Read: Shubman Gill: గిల్ కు యువరాజ్ సింగ్ బాసట.. పాక్ మ్యాచ్ ఆడాలంటూ..!
We’re now on WhatsApp. Click to Join.
హరీస్ పాకిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడతాడు
హారిస్ పాకిస్థాన్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడతాడని మీకు తెలిసిందే. ఇప్పటి వరకు అతను 1 టెస్టు, 30 వన్డేలు, 62 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. టెస్టులో 1 వికెట్ తీశాడు. ఇది కాకుండా వన్డేల్లో 24.06 సగటుతో 58 వికెట్లు తీశాడు. టీ20 ఇంటర్నేషనల్లో హారిస్ 21.71 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు. జనవరి 2020లో బంగ్లాదేశ్తో జరిగిన T20 మ్యాచ్లో హారిస్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Related News
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. సోషల్ మీడియాలో ప్రోమో వీడియో వైరల్..!
T20 వరల్డ్ కప్ 2024.. IPL 2024 ఫైనల్ తర్వాత ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.