Gunshots fired: పాకిస్థాన్లో ఇంగ్లండ్ జట్టుకు సమీపంలో కాల్పుల కలకలం
- By Gopichand Published Date - 02:43 PM, Fri - 9 December 22
పాకిస్థాన్లో మరోసారి కాల్పులు (Gunshots fired) కలకలం సృష్టించాయి. అక్కడ క్రికెట్ మ్యాచ్ కోసం వెళ్లిన ఇంగ్లండ్ (England) ఆటగాళ్లు బస చేసిన హోటల్కు సమీపంలో కాల్పులు (Gunshots fired) ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో కాల్పులు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక (Srilanka) టీంపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (డిసెంబర్ 9) నుంచి ముల్తాన్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం సిరీస్లో 1-0తో ముందంజలో ఉంది. రెండో టెస్టుకు ముందు గురువారం ముల్తాన్లోని ఇంగ్లండ్ జట్టు హోటల్ సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పాకిస్థాన్ చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది.
పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ముల్తాన్లో కాల్పుల కలకలం రేగింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హోటల్ దగ్గర తుపాకీ శబ్దాలు వినిపించాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇంగ్లండ్లోని ముల్తాన్ స్టేడియంలో శిక్షణ కోసం హోటల్ నుంచి బయలుదేరే ముందు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ప్రస్తుతం జరుగుతున్న పాక్ టూర్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధ్యక్ష స్థాయి భద్రతను కల్పించినట్లు సమాచారం. అయితే ఈ ఘటన ఇంగ్లండ్ శిక్షణపై ఎలాంటి ప్రభావం చూపలేదు. క్రీడాకారులను భద్రతా వలయంలో స్టేడియానికి తరలించారు. క్రీడాకారులు అక్కడ సాధన చేశారు.
Also Read: Chamika Karunaratne: క్యాచ్ పట్టబోయాడు.. పళ్లు రాలాయి..!
వచ్చే ఏడాది ఆసియా కప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లబోదని, ఆసియా కప్ను తటస్థ వేదికగా నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ జై షా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లో జరగనున్న ప్రపంచకప్లో ఆడవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా బెదిరించారు. అదే సమయంలో, వచ్చే ఏడాది పాకిస్తాన్కు వెళ్లే భారత జట్టుకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఆటగాళ్ల భద్రతే మనకు చాలా ముఖ్యమని అక్టోబర్ 20న చెప్పారు. వన్డే ప్రపంచకప్కు పాకిస్థాన్తో సహా పాల్గొనే దేశాలను సాదరంగా ఆహ్వానిస్తామని, షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్ జరుగుతుందని క్రీడా మంత్రి తెలిపారు. పాకిస్థాన్లో భద్రతపై ఆందోళన నెలకొని ఉన్నందున టీమిండియాను పాక్కు పంపే విషయమై హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Related News
England Cricketer: మాంచెస్టర్లో చిక్కుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్.. కారణమిదే..?
క్రికెట్కు దూరంగా ఉన్న తర్వాత స్టోక్స్ అమెరికాలోని మాంచెస్టర్లో తన కుటుంబంతో సెలవులు గడపడానికి వెళ్ళాడు.