MSDCA : ధోనీ స్కూల్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రషీద్
ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 పోస్టర్ను చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్
- By Prasad Published Date - 07:07 PM, Fri - 4 August 23
ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 పోస్టర్ను చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్ ఆవిష్కరించారు. శుక్రవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్లో జరిగిన స్కూల్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రషీద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ వర్థమాన క్రికెటర్లను ప్రోత్సహించడానికి అండర్-14 స్థాయిలో టీ20 లీగ్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి లీగ్ల్లో ఆడడం వల్ల ప్రతిభ గల క్రికెటర్లు త్వరగా వెలుగులోకి వస్తారని తెలిపారు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్లు లేవని, ఎక్కడ టోర్నమెంట్లు జరుగుతున్నాయో, వెతుక్కోని ఆడేవాడినని తెలిపారు. సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొని, ఈ లీగ్లో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రషీద్ కోరారు. అనేక కష్టాలను ఎదుర్కొని, ఒక పేద కుటుంబం నుంచి పైకొచ్చిన రషీద్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పల్లవి విద్యాసంస్థల సీఓఓ యశస్వి తెలిపారు. రషీద్నిప్రేరణగా తీసుకొని, క్రికెట్లోనే కాకుండా విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో కష్టపడి రాణించాలని సూచించారు. 2022 అండర్-19 వరల్డ్కప్లో రాణించి, తన సత్తా నిరూపించుకున్న రషీద్, భవిష్యత్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యశస్వి ఆకాంక్షించారు. ఆసక్తి గల క్రీడాకారులు లీగ్లో ఆడేందుకు ఈ నెంబర్లకు 7396386214, 7618703508 ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్లోని ఎంఎస్డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్షన్స్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్డీసీఏ తెలంగాణ భాగస్వామి బ్రైనాక్స్ బీ డైరెక్టెర్ రషీద్ బాషా, 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టెర్ బి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
Hyd : ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు..
Uppal Stadium: నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్(Sunrisers), గుజరాత్(Gujarat) మ్యాచ్(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. We’re now on WhatsApp. Click to Join. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ�