Dhoni Lost Cricket: ఎంఎస్ ధోనీపై ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీ మాతో కామెంటరీ బాక్స్లో ఉండాలి. అతను క్రికెట్ను కోల్పోయాడు. అతనికి ఇది ముగిసిపోయింది.
- Author : Gopichand
Date : 06-04-2025 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
Dhoni Lost Cricket: వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఎంఎస్ ధోనీ (Dhoni Lost Cricket) ఐపీఎల్ 2025లో పరుగులు సాధించినప్పటికీ అతని ఇన్నింగ్స్కు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. ధోనీ ఈ సీజన్లో కూడా చాలా దిగువ స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నాడు. కానీ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. జట్టు తక్కువ పరుగుల్లోనే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. దీంతో ధోనీ చాలా త్వరగా బ్యాటింగ్ చేయడానికి క్రీజ్పైకి రావాల్సి వచ్చింది. అయినప్పటికీ ధోనీ ఎన్నోసార్లు సీఎస్కేను కష్టాల నుంచి కాపాడి విజయం అందించినప్పటికీ, ఈ సీజన్లో అతను తన మాయాజాలాన్ని చూపించలేకపోతున్నాడు. అందుకే అతనితో కలిసి ఆడిన మాథ్యూ హేడెన్ అతన్ని కామెంటరీలో చేరమని సలహా ఇచ్చాడు.
ఎంఎస్ ధోనీ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లో 30 పరుగులు చేశాడు. కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో మూడో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్ గురించి కూడా చాలా చర్చలు జరిగాయి. ఎందుకంటే ధోనీ తల్లిదండ్రులు, అతని భార్య మ్యాచ్ చూడటానికి వచ్చారు.
Also Read: Canada: కెనడా పార్లమెంట్కు తాళాలు.. ఎందుకో తెలుసా..? అక్కడ అసలేం జరుగుతుందంటే?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. “ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీ మాతో కామెంటరీ బాక్స్లో ఉండాలి. అతను క్రికెట్ను కోల్పోయాడు. అతనికి ఇది ముగిసిపోయింది. అతను దీన్ని అంగీకరించాలి. లేకపోతే చెన్నైకి ఇంకా ఆలస్యం కాకముందే” అని అన్నాడు. ఢిల్లీతో ఓడిపోయిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ధోనీ రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు ఫ్లెమింగ్ ఇలా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఊహాగానాలకు చెక్ పెట్టడం నా పని కాదు. నాకు ఎటువంటి సమాచారం లేదు. నేను ఇప్పటికీ అతనితో కలిసి పనిచేయడాన్ని ఆనందిస్తున్నాను. అతను ఇప్పటికీ బలంగా ఉన్నాడు. ఈ రోజుల్లో నేను అడగడం కూడా లేదు. మీరే అడుగుతున్నారని సమాధానం ఇచ్చారు.