Delhi Capitals: ఉత్కంఠ పోరులో పంజాబ్పై ఢిల్లీ సూపర్ విక్టరీ!
ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో పంజాబ్ టాప్-2లో నిలవాలనే ఆశలకు గట్టి దెబ్బ తగిలింది.
- By Gopichand Published Date - 11:44 PM, Sat - 24 May 25

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పంజాబ్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో పంజాబ్ టాప్-2లో నిలవాలనే ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు మొదట ఆడుతూ 206 పరుగులు చేసింది. దానికి సమాధానంగా ఢిల్లీ చివరి ఓవర్ వరకు జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్కు 207 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి సమాధానంగా ఢిల్లీకి కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ 55 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో స్థిరమైన ఆరంభాన్ని అందించారు. రాహుల్ 35 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ ఔటైన తర్వాత డు ప్లెసిస్ కూడా 23 పరుగులతో పెవిలియన్కు చేరాడు.
పంజాబ్ కింగ్స్ 206 పరుగుల భారీ స్కోర్ నమోదు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తరపున ప్రభ్సిమ్రన్ సింగ్ 28 పరుగులు చేశాడు. అయితే ప్రియాంశ్ ఆర్య మాత్రం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జోష్ ఇంగ్లిస్ 32 పరుగులు, నెహల్ వధేరా 16 పరుగులు జోడించారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒకవైపు నిలకడగా ఆడుతూ 53 పరుగులు చేశాడు. అతనికి తోడుగా మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో నాటౌట్గా 44 పరుగులు చేశాడు. దీని కారణంగానే పంజాబ్ కింగ్స్ 206 పరుగుల స్కోర్ సాధించగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీశారు.
Also Read: Education Loan: ఎల్ఎల్బీ చదవాలని చూస్తున్నారా? అయితే రూ. 7 లక్షల రుణం పొందండిలా!
విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్ ముగించింది
207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 35 పరుగులు, ఫాఫ్ డు ప్లెసిస్ 23 పరుగులు చేశారు. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ 44 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సమీర్ రిజ్వీ కేవలం 25 బంతుల్లో నాటౌట్గా 58 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఢిల్లీ జట్టు ఐపీఎల్ 2025లో తమ చివరి మ్యాచ్ను 6 వికెట్ల తేడాతో గెలిచి గౌరవం నిలబెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ టాప్ 2లోకి వెళ్లే అవకాశం చాలా కష్టతరమైంది. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు మే 26న ముంబై ఇండియన్స్తో తలపడనుంది.