Champions Trophy Final: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్లో వర్షం పడే అవకాశం ఉందా?
ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో వర్షం కురిసే అవకాశం లేదు. IST మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావచ్చని, ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చని అంచనా.
- By Gopichand Published Date - 10:19 AM, Sun - 9 March 25

Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ (Champions Trophy Final) మ్యాచ్ జరగనుంది. దుబాయ్లో మండుతున్న వేడిలో ఈసారి టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని అంచనా వేశారు. కాబట్టి మధ్యాహ్నం ఎండలో లక్ష్యాన్ని ఛేదించడానికి జట్లు ఇష్టపడతారు. కాబట్టి టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు మంచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
వాతావరణం ఇలాగే ఉంటుంది
ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో వర్షం కురిసే అవకాశం లేదు. IST మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావచ్చని, ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చని అంచనా. రోజు గడుస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయితే దుబాయ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కొన్ని మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత 28 °C (82.4 °F)కి పడిపోయే అవకాశం ఉంది.
Also Read: Janasena : అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించిన నాగబాబు
ఇదీ పిచ్ రిపోర్ట్
దుబాయ్ పిచ్ ఇప్పటి వరకు బౌలర్లకు ఉపయోగపడుతోంది. ఇక్కడ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే బంతి బ్యాట్పైకి వస్తుంది. టీమ్ ఇండియా దృష్టిలో మంచి విషయం ఏమిటంటే.. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఈ మైదానంలో భారత్- న్యూజిలాండ్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కూడా జరిగింది. ఇక్కడ భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ
న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్వెల్, మిచెల్ శాంట్నర్, విల్ ఓరూక్, కైల్ జెమీసన్, మ్యాట్ హెన్రీ/జాకబ్ డప్ఫీ.