World Cup 2023: భారత్ టార్గెట్ 257
ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:06 PM, Thu - 19 October 23
World Cup 2023: ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి నాలుగో విజయాన్ని నమోదు చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్లో లిటన్ దాస్ 66 పరుగులు చేశాడు. అతడితో పాటు తాంజిద్ 51 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేశారు.
రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ చూస్తే.. మొత్తం 40 మ్యాచ్లు ఆడారు. ఇందులో భారతదేశం 31 మ్యాచ్లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్లు గెలిచింది. కాగా ఒక మ్యాచ్ ఫలితాన్ని చేరుకోలేకపోయింది.
భారత్ ప్లేయింగ్ 11 – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 – లిటన్ దాస్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హద్దే, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు షరీఫుల్ ఇస్లాం.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.