Athiya Shetty, KL Rahul : పెళ్ళి డేట్ మారింది
బాలీవుడ్ హీరోయిన్స్తో భారత క్రికెటర్ల ప్రేమాయణం కొత్తేమీ కాదు. పటౌడీ, షర్మిలా ఠాగూర్ నుంచి నిన్నటి కోహ్లీ-అనుష్క వరకూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలే. తాజాగా ఇదే జాబితాలో మరో జంట చేరబోతోంది.
- By Hashtag U Published Date - 05:53 PM, Tue - 19 July 22
బాలీవుడ్ హీరోయిన్స్తో భారత క్రికెటర్ల ప్రేమాయణం కొత్తేమీ కాదు. పటౌడీ, షర్మిలా ఠాగూర్ నుంచి నిన్నటి కోహ్లీ-అనుష్క వరకూ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలే. తాజాగా ఇదే జాబితాలో మరో జంట చేరబోతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ హీరో సునీల్షెట్టి కుమార్తె అతియా షెట్టి ఒక్కటి కాబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నా రెండు కుటుంబాల పెద్దలు ఇప్పటికే పలుసార్లు చర్చించుకున్నారు. అయితే మరో మూడు నెలల్లో వీరి వివాహం ఉండొచ్చని ఇటీవలే గట్టిగా వార్తలు వినిపించాయి. టీ ట్వంటీ వరల్డ్కప్ తర్వాత మరింత బిజీ షెడ్యూల్ ఉండడంతో వివాహం చేసుకుని హనీమూన్ ఎంజాయ్ చేయాలని ఈ జంట భావించింది. అయితే తాజాగా వీరి పెళ్ళి వేడుక వాయిదా పడనున్నట్టు సమాచారం.
కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023 ప్రారంభంలో జరగనుందని తెలుస్తోంది. 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో పెళ్లి జరుగుతుందట. ముంబైలోని ఖరీదైన పాలి హిల్లోని సంధు ప్యాలెస్ అనే భవనంలో పెళ్లి అనంతరం అతియా, రాహుల్ నివాసం ఉండనున్నారు. దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేకపోవడంతో పెళ్ళి వాయిదా పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడే వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. రాహుల్-అతియా అభిరుచికి తగ్గట్టు విలాసవంతంగా దీని నిర్మాణం జరుగుతుండగా…కొత్త ఏడాది ఆరంభంలో ఇది పూర్తి కావొచ్చని సమాచారం.
నిజానికి చాలా కాలం నుంచే కెఎల్ రాహుల్ అతియాతో డేటింగ్లో ఉన్నాడు. చాలా పార్టీల్లో, వెకేషన్స్లో కలిసి కనిపించారు. ఇటీవల గాయం కారణంగా సర్జరీ కోసం రాహుల్ జర్మనీ వెళ్ళినప్పుడు కూడా అతియా అతని వెంటే ఉండి బాగోగులు చూసుకుంది. దీంతో వీరిద్దరి లవ్ స్టోరీపై క్లారిటీ వచ్చింది. కాగా పెళ్లి విషయమై కేఎల్ రాహుల్ తల్లిదండ్రులు ఇటీవలే అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టిని కలిశారని బాలీవుడ్లో ప్రచారం జరిగింది. రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని సందర్శంచారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దాని నిర్మాణం పూర్కి కాకపోవడంతో వాయిదా పడినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం కెఎల్ రాహుల్ విండీస్ టూర్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే విండీస్తో జరిగే టీ ట్వంటీ సిరీస్లో ఆడనున్నాడు.
Tags
Related News
KL Rahul: లక్నోకు బిగ్ షాక్.. జట్టును వీడనున్న కేఎల్ రాహుల్..?
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ముఖ్యాంశాలలో ఉన్నారు.