India Women’s Team: ఆసియా గేమ్స్ లో సెమీ ఫైనల్స్ కి చేరిన భారత మహిళల జట్టు.. రాణించిన షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్..!
ఆసియా క్రీడలు 2023 (Asian Games 2023)లో మహిళల క్రికెట్ ఈవెంట్లో భారత్- మలేషియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత మహిళల జట్టు (India Women's Team) సెమీఫైనల్కు చేరుకుంది.
- By Gopichand Published Date - 11:18 AM, Thu - 21 September 23
India Women’s Team: ఆసియా క్రీడలు 2023 (Asian Games 2023)లో మహిళల క్రికెట్ ఈవెంట్లో భారత్- మలేషియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత మహిళల జట్టు (India Women’s Team) సెమీఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లో కూడా వర్షం అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా మ్యాచ్ను 15-15 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు 15 ఓవర్లలో 173 పరుగులు చేసింది.
ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్లో కేవలం 2 బంతులు మాత్రమే ఆడిన తర్వాత భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనితో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. సెప్టెంబరు 24న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
Also Read: India vs Australia: మెగా టోర్నీకి ముందు బిగ్ ఫైట్.. రేపటి నుంచే భారత్, ఆసీస్ వన్డే సిరీస్
రాణించిన షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్
మలేషియాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. ఈ మ్యాచ్లో కెప్టెన్ స్మృతి మంధాన, షెఫాలీ వర్మల జోడి జట్టుకు గొప్ప శుభారంభాన్ని అందించింది. వీరిద్దరి మధ్య తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం కనిపించింది. మంధాన 16 బంతుల్లో 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్కు చేరుకుంది. నంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చిన స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ఒక ఎండ్ నుండి వేగంగా పరుగులు చేయడం ప్రారంభించింది. షెఫాలీ వర్మ కూడా నిరంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరు రెండో వికెట్కు 47 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్లో షెఫాలీ వర్మ 39 బంతుల్లో 67 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్కు చేరుకుంది.
ఇక్కడ నుండి జెమీమాకు రిచా ఘోష్ మద్దతు లభించింది. ఇద్దరి మధ్య మూడవ వికెట్కు 12 బంతుల్లో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెమీమా 29 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయగా, రిచా కూడా 7 బంతుల్లో 21 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది.
Related News
Asian Games 2023 : ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి సురేఖ.. విజయవాడలో ఘన స్వాగతం పలికి శాప్ అధికారులు
ఆసియా క్రీడలు 2023లో బంగారు పతక విజేత జ్యోతి సురేఖకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధులు ఘన