Dhoni Sleep Video: విమానంలో ధోనీ కునుకు.. వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ని ప్రేమించే ప్రతి అభిమాని ధోనీ ఆటకు దాసోహం అవ్వాల్సిందే. దీని ఆట కంటే అతని కెప్టెన్సీకి మంత్రముగ్దులు అవుతుంటారు.
- By Praveen Aluthuru Published Date - 03:20 PM, Sun - 30 July 23
Dhoni Sleep Video: ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ని ప్రేమించే ప్రతి అభిమాని ధోనీ ఆటకు దాసోహం అవ్వాల్సిందే. దీని ఆట కంటే అతని కెప్టెన్సీకి మంత్రముగ్దులు అవుతుంటారు. ధోనీ సారధ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టాడు. భారత్ కు కలగా మిగిలిన ప్రపంచ కప్ ని గెలిపించాడు. దీంతో ధోనీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ధోనీకి సాధ్యం కాదంటూ ఏమీ లేదంటూ మాజీలు బ్రహ్మరథం పట్టారు. 2019లో మాహీ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు.
Cutest video on the Internet today 🤩💛#WhistlePodu #MSDhoni
📹: karishma__6e pic.twitter.com/fOyRh1G079— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) July 29, 2023
ధోనీతో ఒక్క ఫోటో దిగినా చాలనుకునే అభిమానులు కోట్లలో ఉంటారు. అప్పుడప్ప్పుడు ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అది కూడా ఎయిర్పోర్టులోనో, ఏదైనా ప్రయివేట్ ప్రదేశంలో మాత్రమే అరుదుగా అవకాశం వస్తుంది. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ కు అవకాశం దక్కింది. కాకపోతే ధోనీ పర్మిషన్ లేకుండా వీడియో తీసింది. మాహీ ,సాక్షితో కలిసి ఇటీవల ఓ విమానంలో ప్రయాణించారు. ధోనీ అలసిపోయినట్టున్నాడు. కొద్దిసేపు కునుకు తీశాడు. ఇక ఇదే అదునుగా ఎయిర్ హోస్టెస్ ధోనీ పడుకున్న వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ నిద్రపోతుండగా.. పక్కనే సాక్షి కూర్చున్నారు. క్యాబిన్ వద్ద ఎయిర్ హోస్టెస్ వీడియోలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అరుదుగా వచ్చే అవకాశాన్ని ఆ మహిళ వదులుకోలేదు.
When your inner MS Dhoni fan can't resist taking a picture, even on a plane!
📸: karishma__6e/Instagram pic.twitter.com/k8R3X9vcpQ
— CricTracker (@Cricketracker) July 29, 2023
Also Read: Video Viral: నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా డాన్స్ చేసిన యువతి.. చివరికి?
Related News
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.