HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ysrcp Protests Electricity Hike Roja Slams Chandrababu Pawan

RK Roja : ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదు

RK Roja : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నగరిలో జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బైక్ ర్యాలీ నిర్వహించి.. నగరి కూడలిలో ధర్నాకు దిగారు.

  • Author : Kavya Krishna Date : 27-12-2024 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rk Roja
Rk Roja

RK Roja : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు, నిరసన సమావేశాలు వంటి పలు కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Manmohan Singh: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు ఇష్ట‌మైన కారు ఇదే!

చంద్రబాబు ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించిన రోజా, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించారు. “కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాన్ని పెంచుతూ వస్తుంటే, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు ఆర్కే రోజా. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు “విద్యుత్ ఛార్జీలు పెంచం, వీలైతే తగ్గిస్తాం” అని చెప్పి, ఇప్పుడు ప్రజలపై భారాన్ని పెంచారని ఆర్కే రోజా మండిపడ్డారు. “పవన్ కల్యాణ్‌ ‘పెంచిన ఛార్జీలను ఒప్పుకోమని’ చెప్పి, ఇప్పుడు ఆచరణలో ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి ఎందుకు వెనుకడుగేస్తున్నారు?” అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలను వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండగా, ప్రజలపై పెరుగుతున్న విద్యుత్‌ భారాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఈ ఆందోళనలు చేపడుతున్నట్లు రోజా తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కారణం అంటూ ఆరోపణ చేస్తున్నారని ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని రోజా ప్రశ్నించారు. ఈ రోజు బాబు హామీలకు ష్యూరిటీ లేదు, ఆయన మాటలకు గ్యారంటీ లేదు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు అని రోజా ఆరోపించారు.

Honda SP160: మార్కెట్లోకి విడుదలైన హోండా ఎస్పీ 160 2025 బైక్.. ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu naidu
  • Electricity Hike
  • Pawan Kalyan
  • Political Protests
  • Power Tariff
  • Public Issues
  • RK Roja
  • ysrcp

Related News

Pawan Kalyan Adopts Two Gir

అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని, జూలోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, ఆ మూగజీవుల సంరక్షణకు మరియు ఆహార ఖర్చులకు అవసరమైన నిధులను తానే స్వయంగా భరిస్తానని వెల్లడించడం పర్యావరణ ప్రేమికులను ఆకర్షించింది

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, డిమాండ్ చేయడమే ఆయన చేసిన తప్పా ?

  • పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd