Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Woman Reunited With Son 3 Years After His Birth In Assam News Goes Viral

Viral News: తల్లికి చనిపోయిన బిడ్డను ఇఛిన‌ వైద్యులు.. చనిపోలేదని పోరాడటంతో మూడేళ్లకు?

  • By Nakshatra Published Date - 07:00 PM, Mon - 13 June 22
Viral News: తల్లికి చనిపోయిన బిడ్డను ఇఛిన‌ వైద్యులు.. చనిపోలేదని పోరాడటంతో మూడేళ్లకు?

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బిడ్డ తన తల్లి హక్కున చేరడం కోసం సుమారు మూడు సంవత్సరాల పాటు సమయం పట్టింది. అస్సాంలో జరిగిన ఈ ఘటన పాతది అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 లో అస్సాం లోని బార్‌పేట్‌ జిల్లాలో నజ్మా ఖనమ్ అనే మహిళ ప్రభుత్వాస్పత్రిలో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డను పిల్లల సంరక్షణ గదిలో ఉంచిన అనంతరం వైద్య సిబ్బంది తమ బిడ్డ చనిపోయిందని, చనిపోయిన బిడ్డను తీసుకువచ్చి నజ్మా చేతిలో పెట్టారు.

ఈ విధంగా చనిపోయిన బిడ్డను తీసుకువచ్చి తనకు ఇవ్వడంతో ఆమె ఆ బిడ్డ తన బిడ్డ కాదు అంటూ పోరాటం చేసింది. ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వగా ఇలా చనిపోయిన బిడ్డను చేతిలో పెట్టేసరికి నజ్మా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు విచారణ చేసి ఆ బిడ్డను డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. ఈ విధంగా ఈ విచారణ ముగిసి ఆ బిడ్డ తల్లి చెంతన చేరడం కోసం మూడు సంవత్సరాల సమయం పట్టింది.

Assam Incident

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో ఎవరెవరు ప్రసవించారు అనే విషయాల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే అదే రోజు అదే ఆస్పత్రిలో నజ్మా అనే పేరుతో మరో మహిళ కూడా ప్రసవించిందని, తన బిడ్డ చనిపోతే వైద్యులు నిర్లక్ష్యం కారణంగా బిడ్డలను తారుమారు చేశారని విచారణలో తేలింది. 2020 అక్టోబర్‌లో బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిడ్డకు నజ్మా ఖనమ్‌కు అప్పగించారు. ఈ విధంగా తన బిడ్డ కోసం మూడు సంవత్సరాల పాటు న్యాయపోరాటం చేసిన తల్లి చివరకు తన బిడ్డను తన సొంతం చేసుకుంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ బిడ్డ మూడు సంవత్సరాల పాటు తల్లికి దూరంగా ఉంది.

Tags  

  • Assam news
  • hospital negligence
  • mother son

Related News

    Latest News

    • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

    • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

    • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

    • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

    • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

    Trending

      • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

      • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

      • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

      • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

      • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    • Copyright © 2022 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam
    • Follow us on: