Murder : భర్తను హత్య చేసిన భార్య.. వడదెబ్బ అంటూ డ్రామా..!
- Author : Prasad
Date : 25-05-2026 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కాలంలో భార్య చేతిలో భర్తలు హత్యకు గురవుతున్నారు. వివాహేతర సంబంధాల కారణాలతోనే పలు హత్యలు జరిగిన సంగంతి తెలిసింది. తాజాగా వడదెబ్బ ముసుగులో ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల తనిఖీల్లో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలా లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.