BJP : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరు..?
- By Prasad Published Date - 08:56 PM, Thu - 16 June 22
ఈ నెల(జులై) 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తుంది. బీజేపీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి పేర్లను చర్చించాలని నిర్ణయించారు. ఆప్ (ఢిల్లీ, పంజాబ్), TRS (తెలంగాణ), YSRCP (ఆంధ్రప్రదేశ్), SAD (పంజాబ్), BJD (ఒడిశా) వంటి పార్టీల నుండి ఎవరూ లేరు కాబట్టి ఆ అభ్యర్థి ఎంత ఉమ్మడిగా ఉంటారనేది ప్రశ్నగా మారింది.
ఈ సమావేశంలో రెండు పేర్లు సూచిం,ఆరు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, జమ్మూ & కాశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా పేర్లను సూచించారు. మరోవైపు జులై 21న వెలువడనున్న ఈ ఎన్నికల్లో దాదాపు విజయం అధికార బీజేపీదే అవుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకాభిప్రాయ అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలతో చర్చిస్తున్నారు. 2002 లో ఎన్డీయే భారత రాష్ట్రపతి పదవికి APJ అబ్దుల్ కలాంను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ చర్య ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఉత్తరప్రదేశ్), TDP (ఆంధ్రప్రదేశ్) వంటి ప్రాంతీయ పార్టీలను అడ్డుకుంది, కలాం తమిళనాడుకు చెందినవారు. ఆ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే మరియు డీఎంకేలు ఆయనను వ్యతిరేకించలేదు. ఏకపక్ష పోటీలో ఓడిపోయిన స్వాతంత్య్ర సమరయోధురాలు లక్ష్మీ సహగల్ను వామపక్షాలు రంగంలోకి దింపాయి.
ఇటీవల 2017లో చివరి ఎన్నికల సమయంలో, అప్పటి బీహార్ గవర్నర్, దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్ను ఎన్నుకోవడం ద్వారా ఎన్డీయే అందరిని ఓట్లను పొందగలిగింది. అందుకే రామ్నాథ్ కోవింద్ సులభంగా గెలిచారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. కర్ణాటక గవర్నర్, దళిత నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గిరిజన కమ్యూనిటీకి చెందిన వారిని కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనుసూయా ఉయికే, ఒడిశాకు చెందిన జువల్ ఓరమ్లు ఎన్డిఎకు చెందిన గిరిజన ప్రాబబుల్స్లో ఉన్నారు. ఈశాన్య ప్రాంత అభ్యర్థికి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇటు దక్షిణాది రాష్ట్రాల ఓట్లు పొందాలని భావిస్తే మాత్రం ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి చివరకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరిని ప్రకటిస్తారో వేచి చూడాలి
Related News
AP Politics : వైసీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనం..!
ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు మైనారిటీలను రెచ్చగొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ట్రిపుల్ తలాక్, సీఏఏతో సహా పార్లమెంట్లో బీజేపీ చేసిన అన్ని బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది.