Hyderabad: వాటర్ మరమ్మతు పనులు వాయిదా, తేదీలు మార్పు
- Author : Balu J
Date : 09-03-2024 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హకీంపేట ఎంఈఎస్లో జరగాల్సిన నిర్వహణ పనులను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి) శుక్రవారం ప్రకటించింది. తద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కొనసాగుతుంది. HMWSSB అధికారుల ప్రకారం, హకీంపేటలో నిర్వహణ పనుల కారణంగా, మార్చి 10 న నగరంలో 12 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బోర్డు ప్రకటించింది. అయితే, మరమ్మతు పనులు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలు త్వరలో ప్రకటించబడుతుంది.
రాబోయే రోజుల్లో అదనంగా 50 ఎంజీడీ కీలకం కానుంది. హైదరాబాద్ లోని 70 మంచినీటి ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణలోని ప్రస్తుత నివేధిక ప్రకారం .. 5000 లీటర్ల ట్యాంకర్ ధర రూ.600 నుండి 2,000 వరకు వుంటుంది. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి సుదూర ప్రాంతాలకు ఎక్కువ ఛార్జీలు ఉంటాయి. ఎంతే కాకుండా వాటర్ సప్లై చేసే వాళ్లు ఇరుకు గల్లీలలో నివాసముంటున్న వారి ఆర్డర్లను నిరాకరిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే రోడ్లు అన్ని పెద్దవిగా ఉన్న కార్లు, బైక్ లు, పార్కింగ్ వల్ల నీటి ట్యాంకర్లు వెల్లడం ఇబ్బందికరంగా మారింది. అధికారులు అలర్ట్ కాకపోతే బెంగళూరు పరిస్తితులు రిపీట్ అయ్యే అవకాశం ఉంది.