TTD : డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం.. ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
డిసెంబర్ 23న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్
- Author : Prasad
Date : 17-12-2023 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
డిసెంబర్ 23న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అదే రోజు, ఆలయాన్ని వివిధ సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి శుభ్రం చేస్తారు. ఉదయం 11 గంటల తర్వాత భక్తులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గతంలో స్వామివారికి సమర్పించే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. అంతేకాకుండా శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్