Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం
- By Balu J Published Date - 06:12 PM, Wed - 25 October 23
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, లారీలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ్మలోనిగూడ గేటు సమీపంలో వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
Chilkur: హనుమాన్ ఆలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం వ్యక్తి
Chilkur: ప్రసిద్ధ చిల్కూరు బాలాజీ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామం త్వరలో వార్తల్లోకి రానుంది. కొత్తగా నిర్మించిన హనుమాన్ ఆలయానికి ఒక ముస్లిం గ్రామస్థుడు 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ముఖ్య అతిథిగా చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఆహ్వానించారు. హనుమాన్ దేవాలయం కోసం తన స్థల�