Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో శనివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. ధర్మశాలలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలకు తూర్పున 22 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.
- Author : Gopichand
Date : 14-01-2023 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో శనివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. ధర్మశాలలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలకు తూర్పున 22 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనికి ముందు కూడా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గురువారం-శుక్రవారాల్లో మధ్యాహ్నం 2.12 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.9గా నమోదైంది.
మొదటి భూకంపం కేంద్రం ధౌలాధర్, RF ఇన్నర్ గ్రోన్ కొండల క్రింద ఉన్న ప్రాంతం. చంబా, కాంగ్రా జిల్లాల చుట్టుపక్కల పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, సిమ్లా, కిన్నౌర్, లాహౌల్ స్పితిలోని కొన్ని ప్రాంతాలు భూకంపాలకు చాలా సున్నితంగా ఉండే సీస్మిక్ జోన్ 5లో ఉన్నాయి.
Also Read: Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
గత ఏడాది నవంబర్ 16న కూడా మండి, కులులో భూకంపం సంభవించింది. డిసెంబర్ 3న చంబాలోని చురా వద్ద రాత్రి భూకంపం వచ్చింది. డిసెంబర్ 16న కిన్నౌర్లో కూడా భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 3.40గా నమోదైంది. వారం క్రితం జనవరి 5న ఢిల్లీ-ఎన్సిఆర్లో భూకంపం బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్లో కూడా భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతం భూకంప కేంద్రంగా ఉంది.