TTD Utsavalu: జూన్ లో తిరుమల ఉత్సవాలు ప్రారంభం.. ప్రత్యేక కార్యక్రమాలివే
జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది.
- By Balu J Published Date - 05:49 PM, Mon - 29 May 23
వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది. తిరుమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర ఉత్సవం, జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు జ్వేష్టాభిషేకం నిర్వహించనున్నారు.
జూన్ 4: ఏరువాక పూర్ణిమ ఉత్సవం
జూన్ 14: మాత్రయ ఏకాదశి
జూన్ 28: పెరియాళ్వార్ ఉత్సవం
జూన్ 29: చాతుర్మాస్య వ్రత ప్రారంభం ఉత్సవం
భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని, తదనుగుణంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!
Related News
Pm Modi : దశాశ్వమేథ ఘాట్లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మోడీ గంగా హారతి నిర్వహించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవ�