TRSV Leaders: తెలంగాణలో ఐటీ రంగం అంచెలంచెలుగా ఎదుగుతోంది!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయని,
- Author : Hashtag U
Date : 10-10-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయని, ఇదంతా ఐటీ మినిస్టర్ కేటీఆర్ చొరవతోనే సాధ్యమవుతున్నాయని రాష్ట్ర TRSV ప్రధాన కార్యదర్శి వేల్పుకొండ వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి అడ్డగా మారుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఐటీ రంగంతో పాటు స్వచ్ఛ కార్యక్రమాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్తానంలో నిలిచిందని వెంకటేశ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి సహకారంతో రాష్ట్రం అవార్డులు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.