HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Trs Kavitha Condemns Centres Decision To Auction Cement Corporation Of India

MLC Kavitha: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై కవిత ఫైర్!

చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.

  • By Balu J Published Date - 01:16 PM, Wed - 18 May 22
  • daily-hunt
Kavitha
Kavitha

చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బీజేపీ నాయకులకు ఉన్నదా ? అంటూ నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలి అనుకుంటున్నారు అని కవిత మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారని, మంత్రి కేటీఆర్ అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగిందని కవిత గుర్తు చేశారు. ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటి? కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలి అని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీల‌కు స్ప‌ష్ట‌మైన ఎజెండా ఉంది అని, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీల‌కు నిర్దిష్ట‌మైన ఎజెండా ఉంద‌ని, రాహుల్ గాంధీ ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాలి కవిత రాహుల్ గాంధీకి సూచించారు. మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారింది. రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుంద‌ని, ప్రాంతీయ పార్టీలే సార‌థ్య‌ బాధ్య‌త‌లు వ‌హిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయని, దేశంలో నిరుద్యోగం పెరిగింద‌ని, మ‌త‌ప‌రమైన‌ స‌హ‌నం లోపించింద‌ని, ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల విజ‌యంపై కాంగ్రెస్ అసూయ వ్య‌క్తం చేస్తుందని, మెరుగైన పాల‌న‌ అందిస్తున్నాము కాబట్టి ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Modi
  • cement project
  • MLC Kavitha
  • telangana

Related News

Chandrababu's speed in AP's development: Malla Reddy praises

Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు.

  • Group1 Exam Case

    Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

  • KTR responds for the first time on MLC Kavitha's suspension..what does he mean..?

    KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

  • Strategic discussions to achieve 42% reservation for BCs: Telangana Jagruti President Kavitha

    Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

  • Congress has no moral right to speak on Kamareddy land: Ramachandra Rao

    BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: రామచందర్ రావు

Latest News

  • Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్ భవన్‌‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే

  • DRC Mall: మైసూరు షాపింగ్ మాల్‌లో ఘోరం.. నాలుగో అంతస్తులో పని చేస్తుండగా..

  • West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ

  • Weather Updates : అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు

  • Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్‌..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd