Warangal : వరంగల్లో విషాదం.. పాత భవనం కూల్చివేతలో ఇద్దరు కార్మికులు మృతి
- By Prasad Published Date - 06:22 PM, Sat - 11 June 22
వరంగల్ పట్టణంలో విషాదం నెలకొంది. పాత భవనం కూల్చివేత సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయారని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు సైట్లోని ఇతర కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. గాయపడిన మరో ఇద్దరు కార్మికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కూల్చివేతలో నిమగ్నమైన కొందరు కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విషాదానికి దారితీసిందని చెబుతున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు విచారణకు ఆదేశించారు.
Related News
KTR: పెద్దపల్లిలో పెద్ద మెజారిటీతో గెలుస్తున్నం, వరంగల్ లో విజయం మనదే!
KTR: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు.. అటు బీజెపికి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ తోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్త