Owaisi Update: వామ్మో ఒవైసీపై కాల్పులు.. అందుకే జరిపారట..!
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
- By HashtagU Desk Published Date - 11:42 AM, Fri - 4 February 22
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. యూపీలో ఎన్నికల ప్రచారం చేసి మీరట్ నుండి తిరిగి వస్తుండగా, ఛజర్సీ టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై కాల్పులు జరగ్గా, ఆయన క్షేమంగా బయటపడ్డారు. ఈ ఫైరింగ్లో అసదుద్దీన్ ఒవైసీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ, ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ కారుకు మాత్రం పంక్చర్ అయ్యింది.
ఇక ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన దుండగులు ఇద్దరినీ యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని విచారించగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేశారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపామని దుండుగులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దుండుగులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పోలీసులు మరింత విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
Related News
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144సెక్షన్ అమలు
Mukhtar Ansari Death : గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మరణంతో ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh) పోలీసులు హైఅలర్ట్(High alert) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టిం�