CBI : ఏపీలో కలకలం రేపుతున్న సీబీఐ దాడులు..?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించడం కలకలం రేపుతుంది.
- By Hashtag U Published Date - 01:13 PM, Fri - 4 February 22
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించడం కలకలం రేపుతుంది. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా ఎక్కువగా ఉద్యోగులు, బ్యాంకు అధికారుల లక్ష్యంగా జరుగుతున్నాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలను లక్షంగా చేసుకున్నారు అనే ప్రచారం కూడా కాస్త గట్టిగానే జరుగుతుంది.ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనే దానిపై క్లారిటీ లేదు. ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఏపీలో 40 చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ… ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగుల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది.ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం లంచాలు తీసుకుంటున్నారు అని కూడా గుర్తించింది. పేటీఎం, ఫోన్పే, గూగుల్పేల ద్వారా డబ్బులను తీసుకుంటున్న ఉద్యోగస్థులను మీద ఎక్కువగా దృష్టి సారించింది. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లిలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్లో జరిగిన అక్రమాలపై 4 కేసులు నమోదు చేసిన సీబీఐ పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది.
Tags
Related News
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.