AP CS : డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోండి.. ఆరోగ్యశాఖకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
చాలా కాలంగా విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను
- By Prasad Published Date - 08:36 AM, Wed - 9 August 23
చాలా కాలంగా విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న తరుణంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా 30 రోజులకు పైగా విధులకు గైర్హాజరైన వైద్యులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా విధులకు గైర్హాజరైన వైద్యులను గుర్తించామని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. వారికి నోటీసులు అందజేశామని, వారంలోగా విధులకు హాజరుకాని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా రానున్న ఐదు వైద్య కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం