Srisailam : శ్రీశైలం ఆలయానికి భారీగా హుండీ ఆదాయం
శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి 13 రోజులకు (ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 21 వరకు) హుండీ సేకరణ
- By Prasad Published Date - 07:25 AM, Thu - 23 February 23
శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి 13 రోజులకు (ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 21 వరకు) హుండీ సేకరణ ద్వారా రూ.5.11 కోట్లు వచ్చాయి. 100. 400 గ్రాముల బంగారం, 6.500 కిలోల వెండి ఆభరణాలు సహా రూ.5.11 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. భారతీయ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాలతో పాటుగా, భక్తులు USA డాలర్లు 249, సింగపూర్ డాలర్లు 50, ఆస్ట్రేలియన్ డాలర్లు 20, కెనడా డాలర్లు 10 మరియు 5 కువైట్ దిర్హమ్లను విరాళంగా అందజేశారు. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, పటిష్ట నిఘాలో చేపట్టిన లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది, శివభక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీశైలం ఆలయానికి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Related News
Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు
శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో గత రెండుసార్లు వాయిదా వేశారని..పవన్ పేర్కొన్నారు