Road Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో సోమవారం ఒక్క రోజే మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి
- By Prasad Published Date - 09:21 PM, Mon - 18 July 22
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో సోమవారం ఒక్క రోజే మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తాజాగా ఓ ఆటో .. కంటైనర్ ట్రక్కు చక్రాల కిందకు రావడంతో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం (బ్లాక్) మైనూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 161పై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మైనూర్ నుంచి బిచ్కొండ వైపు రాంగ్ రూట్లో వస్తున్న ఆటో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ కింద పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Related News
Yadadri : ప్లాస్టిక్ పై నిషేధం విధించిన యాదాద్రి దేవస్థానం
Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్