Shocking: బిహార్ లో దారుణం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు
- By Balu J Published Date - 11:18 AM, Fri - 9 June 23
బిహార్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ జంట మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడు ప్రియురాలికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు తీవ్ర మనస్తాపంతో కుంగిపోయింది. నమ్మిన ప్రియుడే వంచించాడనే ఆలోచన ఆమెను ఆగ్రహంతో రగిలిపోయేలా చేసింది. సదరు ప్రియుడు ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అతను.. ఇటీవలే ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ నెల 23న అతనికి వేరొక యువతితో పెళ్లి జరగబోతోందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె ప్రియుడిపై కక్ష తీర్చుకోవాలని భావించింది. బిహార్లోని పట్నాలో గల ఓ హోటల్కు ప్రియుడిని రప్పించింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటనతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: Indian Railway Jobs: రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..!
Tags
Related News
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళ
Hyderabad: మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.లక్ష్మి(30) కొన్నేళ్ల క్రితం యూసుఫ్ గూడలో ఫుట్ పాత్ పై ఓ బాలికను గుర్తించి ఆశ్రయం కల్పించింది. రెండేళ్లుగా మైనర్ బాలికను లక్ష్మి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో �