TDP : చంద్రబాబు పీఏ సహా 45 మంది కేసు నమోదు
చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్లో 45 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం
- By Prasad Published Date - 10:28 PM, Thu - 29 June 23
చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్లో 45 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచి మహాదేవి, ఆమె భర్త జయశంకర్లను ఎస్సై దూషించి ఎన్ కౌంటర్ చేస్తానని గత వారం కుప్పం కోర్టు వద్ద బెదిరించారు. అయితే ఎస్సై వ్యాఖ్యలను నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్ కానిస్టేబుల్ మణి చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) మనోహర్ తోపాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను దూసించి మళ్లీ తమపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
Tags
Related News
Punganur : పాపాల పెద్దిరెడ్డి..అంటూ పుంగనూరు సభలో చంద్రబాబు ఫైర్..
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని పుంగనూరు సభ సాక్షిగా చంద్రబాబు హెచ్చరించారు