Homeguard Ravindar Suicide : రాజకీయ రగడ రేపుతున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య
ప్రస్తుతం హోంగార్డు రవీందర్ ఆత్మహత్య ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కొంతమంది సరైన టైంకు వేతనాలు ఇవ్వకపోవడం తో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే
- By Sudheer Published Date - 02:43 PM, Fri - 8 September 23
ఎన్నికలు సమీపిస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ (BRS) ఫై నిఘా కన్ను పెట్టింది. ఏ చిన్న అవకాశం వచ్చిన దాన్ని వదులుకోవడం లేదు. రాష్ట్రంలో () ఏంజరిగిన దానిని అధికార పార్టీ బిఆర్ఎస్ తో పోలుస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డు రవీందర్ ఆత్మహత్య (Homeguard Ravindar Suicide) ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కొంతమంది సరైన టైంకు వేతనాలు ఇవ్వకపోవడం తో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే..తన భర్త రవీందర్పై ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి (Petrol Fire) తగులబెట్టారని ఆయన భార్య సంధ్య (Homeguard Ravindar Wife) ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంది. రవీందర్ ఫోన్ (Homeguard Ravindar Phone)ను అన్లాక్ చేసి డేటా డిలీ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు.
తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని అన్నారు. ఇందుకు బదులుగా సొంత పోలీసు శాఖలోని వారే తన భర్తకు కారణమయ్యారని మండిపడ్డారు. హోంగార్డు అధికారి హైమద్.. తన భర్తను దూషించడంతోపాటు అవమానించారని అంటుంది. రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడ్ని హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల స్పందన ఇలా ఉంటె..హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదు ..ప్రభుత్వ హత్య అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతుందని.. హోంగార్డులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : G20 – INDIA Leaders : జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి విందు.. హాజరయ్యే ‘ఇండియా’ లీడర్లు వీరే
హోంగార్డు రవీందర్ చనిపోవడం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రవీందర్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ను వేధించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ మరణం అత్యంత విషాదకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన హోంగార్డు రవీందర్ ను ప్రభుత్వమే హత్య చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని, హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మొత్తం మీద రవీందర్ ఆత్మహత్య ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags
Related News
Vijayashanti : విజయశాంతి మళ్లీ పార్టీ మారనున్నారా..?
రాజకీయవేత్తగా మారిన ప్రఖ్యాత నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సినీ పరిశ్రమ నుంచి ఎందరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.