National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 02:24 PM, Fri - 8 March 24
National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గాయని మైథిలీ ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్తగా గౌరవ్ చౌదిరికు అవార్డును అందజేశారు. 20 విభాగాల్లో మొత్తం 23 మంది విజేతలకు ఈ అవార్డులను ఇచ్చారు.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Micro Creator award to Aridaman at Bharat Mandapam. pic.twitter.com/ihmwkqmAzs
— ANI (@ANI) March 8, 2024
ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో సుమారు 1.5 లక్షలపైగా నామినేషన్లు వచ్చాయి. ఈ విజేతల కోసం ఓటింగ్ను నిర్వహించారు. అందులో 10 లక్షల మంది ఓట్లు వేశారు. విజేతలుగా అంతర్జాతీయ క్రియేటర్లు సహా 23 మంది నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుత జనరేషన్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. తమ ట్యాలెంట్ను నిరూపించుకునేందుకు కూడా సోషల్ మీడియానే ఉపయోగించుకున్నారు యువత. సోషల్ మీడియా ద్వారా ఇన్ప్లూయెన్సర్లు, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సృజనాత్మకత ఆలోచనలను తీసుకొస్తున్న ఇన్ప్లూయెన్సర్లుకు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ను ఈ సంవత్సరం ప్రకటించింది. స్టోరీ టెల్లర్, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఎడ్యుకేషన్, గేమింగ్ వంటివి మొత్తం 20 విభాగాలకు చెందిన వారికి ఈ అవార్డులను ఇస్తున్నారు.
read also : Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..
Related News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.