Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..
- By Pasha Published Date - 01:57 PM, Fri - 8 March 24
Sudha Murthy : ఇన్ఫోసిస్ అధిపతి నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. ఆమెను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈసందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం గొప్ప విషయమని ప్రధాని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ప్రస్థానం అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేయడం దేశంలో మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని మోడీ తెలిపారు.
She comes from a wealthy family with a net worth exceeding ₹35,000,00,00,000 and her son-in-law happens to be the UK PM.
She is a highly accomplished woman.
She remains down-to-earth and committed to preserving Indian tradition.
She is Padma Bhushan Sudha Murthy. pic.twitter.com/QN4wwFuQok
— P C Mohan (Modi Ka Parivar) (@PCMohanMP) March 9, 2023
Also Read : Gujarat Titans: గుజరాత్ టైటాన్స్కు మరో బిగ్ షాక్.. తొలి మ్యాచ్కు స్టార్ ప్లేయర్ దూరం..?
పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను పొందినా..
ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి.. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను పొందినా, ఆమె ఎప్పుడూ సింపుల్గానే కనిపిస్తారు. రచయితగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడి వాళ్లతో ఇట్టే కలిసిపోతారు. గతేడాది మార్చి నెలలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ భగవతి ఆలయంలో జరిగిన పొంగల్ వేడుకల్లో సుధామూర్తి పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఓ సామాన్యురాలిగా కింద కూర్చుని భక్తులందరికీ ఆమె పొంగళిని వడ్డించారు. వేలాది మంది భక్తులకు ఆమె ప్రసాదం వితరణ చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తయ్యగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో చరిష్మా ఉన్న సుధామూర్తి ఇంత సింపుల్గా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024
Related News
Kamala Das: ఒడిశా మాజీ మంత్రి కమలా దాస్ మృతి
ఒడిశా మాజీ మంత్రి, మూడుసార్లు భోగ్రాయ్ ఎమ్మెల్యేగా పని చేసిన కమలా దాస్ ఈ రోజు శుక్రవారం కటక్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 79 సంవత్సరాలు.